ఈనెల 29న మేడిగడ్డ ప్రాజెక్టుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సందర్శించనున్నారు.ఈ మేరకు ఈనెల 29న మంత్రులు బ్యారేజ్ వద్దకు వెళ్లనున్నారు.

 Ministers Uttam And Sridhar Babu For Medigadda Project On 29th Of This Month-TeluguStop.com

మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ లపై మంత్రులు సమీక్షించనున్నారని తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.అలాగే కొత్త ఆయుకట్టు స్థిరీకరణతో పాటు విద్యుత్ అవసరాలపై సమీక్ష నిర్వహించనున్నారు.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు చేపట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రాజెక్టును మంత్రులు సందర్శించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube