తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపటిలో సమావేశం నిర్వహించనున్నారు.సెక్రటేరియట్ లో జరగనున్న ఈ సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొననున్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లా కలెక్టర్లతో తొలిసారి నిర్వహిస్తున్న సమావేశం అవుతున్నారు.
ఇందులో ప్రధానంగా ప్రజాపాలనపై చర్చ జరగనుంది.అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కౌలు రైతుల గుర్తింపుపై చర్చ జరగనుంది.
అనంతరం ప్రజాపాలనతో పాటు ప్రభుత్వం పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.







