అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ట్రాక్టర్ ను ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు.

 Four People Died In Fatal Road Accident In Anantapur District-TeluguStop.com

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే బస్సు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube