కుటుంబం అన్నాక తరచూ ఏవో చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే.కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
కుటుంబం సంతోషంగా ఉందంటే.ఆ కుటుంబ సభ్యులకు సర్దుకుపోయే గుణాలు ఉన్నట్టే.
అలా సర్దుకుపోయే గుణం లేకుంటే.కుటుంబంలో ఎలాంటి దారుణాలు అయినా జరుగుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
డబ్బుల విషయంలో( Money ) తండ్రి కొడుకుల మధ్య గొడవ, ఆగ్రహానికి లోనైన తండ్రి క్షణికావేశంలో కొడుకుని కత్తితో పొడిచి హత్య చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామారెడ్డి లో ( Kamareddy ) చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తాండాలో బాదావత్ వసంతరావు(48)( Badhavat Vasantarao ) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాను.ఇతని కుమారుడు సురేష్ (27)( Suresh ) హైదరాబాదులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.సురేష్ రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు.అయితే బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది.
వసంతరావు ఆగ్రహానికి లోనై క్షనికావేశంలో పక్కనే ఉన్న కత్తితో( Knife ) కొడుకు సురేష్ ఛాతీపై గట్టిగా పొడిచాడు.కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి సహాయంతో సురేష్ ను గాంధారి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరొకవైపు ఇంటి వద్ద ఉన్న వసంతరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బంధువులు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వసంతరావు మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ప్రేమ్ దీప్ గుజ్జల్ తాండా కు చేరుకుని, కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.