తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్ రావు తెలిపారు.ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై దాడి మరియు వాస్తవాల వక్రీకరణే కనిపిస్తోందని పేర్కొన్నారు.
లెక్కలను ప్రభుత్వానికి అనుకూలంగా రాసుకున్నారని ఆరోపించారు.శ్వేతపత్రంలో ప్రజలు, ప్రగతి కోణం లేదన్నారు.
ఈ క్రమంలోనే కావాలంటే హౌస్ కమిటీ వేయాలన్న హరీశ్ రావు అన్ని లెక్కలపై చర్చిద్దామని తెలిపారు.