ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.అలాగే ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే యువగళం ముగింపు సభ కాదన్న ఆయన 2024 ఎన్నికలకు శంఖారావ సభ అని తెలిపారు.







