టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు.అంతేకాకుండా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలుస్తున్నాయి.
ఇకపోతే బాలయ్య బాబు ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో( Bhagavanth Kesari Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య బాబు కూతురు పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఈ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.థియేటర్ల అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ లోనూ దూసుకెళ్తోంది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు తదుపరి సినిమాలలో భాగంగా బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం గౌతమీపుత్ర శాతకర్ణి( Gautamiputra Satakarni ) సినిమా తర్వాత మరొకసారి హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారట బాలయ్య బాబు.శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఒక మహారాజు కథతో ఈ సినిమా రూపొందనున్నట్టు వినికిడి.
ప్రస్తుతం ఆయన కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత అఖండ 2( Akhanda 2 ) మూవీను పట్టాలెక్కిస్తారట.నిజానికి బాలయ్యతో సినిమాలు చేయటానికి చాలామంది దర్శకులు క్యూలో ఉన్నారు.మరి ఈ కథను తెరకెక్కించే దర్శకుడెవరు? ఈ కథ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? దీనికి నిర్మాత ఎవరు? ఇంతకీ శతాబ్దాల క్రితం తెలుగునేలను పాలించిన ఆ మహారాజు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.