అమరావతిలో ఈనెల 17న రాజధాని రైతులు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
అమరావతి ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు కావొస్తున్న సందర్భంగా రైతులు సభను ఏర్పాటు చేశారు.ఈ మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట సభను నిర్వహించేందుకు రైతులు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సభా ఏర్పాట్లపై ఇవాళ అమరావతి, తుళ్లూరు రైతులు సమావేశం కానున్నారు.