తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపటిలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.
అయితే తుంటి ఎముక మార్పిడి సర్జరీ నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు రెస్ట్ అవసరమని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.








