ఎన్టీఆర్ జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తుందని తెలిపారు.
పథకాలు అందని వారికి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ప్రధాని మోదీ గ్యారెంటీ వ్యాను ద్వారా అన్ని పథకాలు అందేలా చేస్తున్నారని చెప్పారు.
డబ్బులు అందరికీ వెళ్లాలని ప్రతి ఒక్కరికీ అకౌంట్లు ఇప్పించామని తెలిపారు.మోదీ ఏ పథకం మొదలు పెట్టినా మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు.2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తయారు చేసేందుకే పథకాలు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.







