తెలంగాణ కొత్త కేబినెట్ తొలి సమావేశం ప్రారంభమైంది.ఈ మేరకు సచివాలయంలోని వ ఫ్లోర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది.
ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన ఆరు గ్యారెంటీలపై చర్చించనున్నారని తెలుస్తోంది.అలాగే మంత్రులకు శాఖలను కూడా కేబినెట్ సమావేశంలో కేటాయించే వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
కాగా రేపు ఉదయం ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ను నిర్వహించనున్నారు.