ఏపీలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది.మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం పార్టీ నేత నాదెండ్ల మనోహార్ మాట్లాడారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని నాదెండ్ల తెలిపారు.జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.
ఏ కార్యక్రమం జరిగినా టీడీపీతో కలిసి పని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారని తెలిపారు.ఈ క్రమంలో టీడీపీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వ్యక్తిగత విషయాలకు ఎవరూ పోవద్దన్న నాదెండ్ల జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.







