మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా

మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హైడ్రామా నెలకొంది.కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

 Midnight Hydrama At Former Ias Ak Goyal's House-TeluguStop.com

అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏం లభించలేదని తెలుస్తోంది.ఐటీ అధికారుల సోదాలకు గోయల్ వారెంట్ కోరటంతో వారు వెనుదిరిగారని సమాచారం.

అయితే మధ్యాహ్న సమయంలో ఫిర్యాదు చేస్తే రాత్రి సమయానికి అధికారులు రావడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే గోయల్ నివాసం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అటు పోలీసులు కూడా భారీగా మోహరించడంతో గోయల్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.మరోవైపు టాస్క్ ఫోర్స్ తనిఖీలపై పలు అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube