హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ -2023కి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వచ్చి తొమ్మిదిన్నరేళ్లు అయిందన్న మంత్రి కేటీఆర్ కోవిడ్, ఎన్నికల వలన ఆరున్నరేళ్లే నికరంగా పాలించామన్నారు.ఆరున్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధి మీ ముందు ఉందని పేర్కొన్నారు.
బెంగళూరును తలదన్నే నగరంగా హైదరాబాద్ మారిందని తెలిపారు.ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో వచ్చిన మార్పు రజనీకాంత్ కు అర్ధమైందన్న కేటీఆర్ ఇక్కడున్న గజినీలకు మాత్రం అర్థం కాలేదని విమర్శించారు.