హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నగదు భారీగా పట్టుబడింది.గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.5 కోట్లను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగదుతో పాటు మూడు సెల్ ఫోన్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ నగదు పార్టీకి చెందిన డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బుకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.







