ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కేతనకొండ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాడ పడ్డారు.
మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.