రోడ్డు సమస్య ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది...?

నల్లగొండ జిల్లా: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎలాంటి అభివృద్ది పనులు చెయ్యొద్దని నిబంధనలకు ఉన్నా నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో అవేవీ పట్టవన్నట్లు రోడ్డు మరమ్మతులు చేస్తున్నా ఎన్నికల అధికారులు ఆ వంక చూడకపోవడం విస్మయం కలిగిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇంత కాలం గుర్తుకు రాని రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని,కేవలం అధికార పార్టీ ఓట్ల కోసమే ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు,సర్పంచ్, ఎంపిటిసి కీలకంగా వ్యవహరిస్తున్నా,

 Road Repair Works In Madugulapalli Mandal During Election Code, Road Repair Work-TeluguStop.com

ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఇదేంటని స్థానికులు అడిగేందుకు ప్రయత్నం చేస్తే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు భయపడి ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

ఇదే విషయమై మీడియా మండల అధికారులకు ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం ఇవ్వడం గమనార్హం.ఇన్ని రోజుల నుంచి వెయ్యని రోడ్లు ఇప్పుడు వేయడం కరెక్ట్ కాదని,దీనికి ఎలక్షన్ కోడ్ వర్తించదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube