బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు రేపు రాష్ట్రానికి రానున్న ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ముందుగా రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడి నుంచి జనగాం వెళ్లనున్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ నిర్వహించే సభకు హాజరవుతారు.మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్లలో జరిగే సభలో పాల్గొననున్న అమిత్ షా సాయంత్రం 5.30 గంటలకు ఉప్పల్ లో రోడ్ షో నిర్వహించనున్నారు.