కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలి..: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్ పై కుట్ర పూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

 False Propaganda On Congress Should Be Avoided..: Revanth Reddy-TeluguStop.com

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని తమపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం చేతికాకపోయినా తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేతకాక కేసీఆర్ ఛత్తీస్ గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.ఈ క్రమంలోనే ఏ సబ్ స్టేషన్ కు అయినా వెళ్దామన్న రేవంత్ రెడ్డి ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నారో చూపించాలని సవాల్ చేశారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ పై అసత్యాలు చెప్పడం మానేయాలని హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube