తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియాంక మోహన్( Priyanka Mohan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.2019లో విడుదలైన గ్యాంగ్ లీడర్( Gang leader ) సినిమాతో ఈమె సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.ఆ తర్వాత శ్రీకారం సినిమాలో నటించి మెప్పించింది.అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతోపాటు ఆమెకు మంచి గుర్తింపును కూడా తెచ్చిపెట్టాయి.అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది.తమిళంలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెప్టెన్ మిల్లర్( Captain Miller ) అనే సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.కాగా ప్రస్తుతం టాలీవుడ్ మూవీ మేకర్స్ దృష్టి అంతా కూడా ప్రియాంక మోహన్ పై పడింది.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందుతున్న ఓజి సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.అయితే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మూవీలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఏ ముహూర్తాన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పటినుంచి ఈమె దశ తిరిగిపోయింది.
తెలుగులో ఆమెకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.అయితే ఇప్పటి వరకు ప్రియాంకకు తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ లేదు.
అయినప్పటికీ ఆమె ప్రస్తుతం పవన్ సరసన నటిస్తుండటంతో టాలీవుడ్( Tollywood ) లో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇప్పటికే నాని సరసన సరిపోదా శనివారం సినిమలో నటిస్తోంది.నాని, ప్రియాంక కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అలాగే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందనున్న నాలుగో సినిమాలో నటించనుంది.
వీటోతో పాటు మరో రెండు చిత్రాల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు ప్రియాంకను సంప్రదించినట్లు సమాచారం.మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రియాంక దశ తిరిగిందని అర్థమవుతుంది.
ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.