రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రోజున సమావేశం ఏర్పాటు చేశారు.ఈసంద్భంగా పసుల వెంకట్, ఎంపిపి వూట్కూరి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ దొంగ హామీలను నమ్మకమే కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ( Congress party) శ్రేణులు ఆరు గ్యారెంటీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు తెలియజేయాలని కవ్వంపల్లి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.







