జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది.దోడా జిల్లాలో అదుపుతప్పి ఓ బస్సు లోయలో పడింది.
ఈ ప్రమాదంలో 30 మంది మృత్యువాత పడ్డారు.
అదేవిధంగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు.అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.