తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే ఆయన తీసిన సినిమాలను చూస్తే మనకు అర్థం అవుతుంది ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అనేది…ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ ని హీరోగా పెట్టి గేమ్ చెంజర్ ( Game Changer )అనే సినిమా చేస్తున్నాడు.
ఇకదానితో పాటుగా కమలహాసన్ ని హీరోగా పెట్టీ భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలో గేమ్ చెంజర్ కథని కార్తీక్ సుబ్బరాజు అనే మరొక తమిళ్ డైరెక్టర్ తన దగ్గర ఉన్న కథని శంకర్ కి అందించడం జరిగింది.ఇక ఇప్పుడు ఆ వార్త చాలా చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే శంకర్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలకి తనే కథని రాసుకుంటూ ఉంటాడు.
కానీ గేమ్ చెంజర్ సినిమాకి మాత్రం కార్తీక్ సుబ్బరాజు దగ్గర నుంచి కథను తీసుకోవడం జరిగింది… నిజానికి కార్తీక్ సుబ్బరాజు( Karthik Subbaraj ) కూడా ఒక మంచి డైరెక్టర్ ఆయన చేసుకోవాల్సిన కథను శంకర్ కి ఎందుకు ఇచ్చాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.అయితే కార్తీక్ సుబ్బరాజు రాసుకున్న ఆ ప్రాజెక్టు కు శంకర్ అయితేనే న్యాయం చేయగలడని ఆయనకి ఆ స్టోరీ ని ఇచ్చినట్టు గా తెలుస్తుంది…

ఇక కార్తిక్ సుబ్బరాజ్ మరో కథ తో ఆయన రాంచరణ్ తో సినిమాకి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ గేమ్ చెంజర్ మూవీ టైంలో రాంచరణ్ కి తనకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడటంతో ఇప్పుడు రాంచరణ్ తో సినిమా చేయడానికి ఒక మంచి కథను రెడీ చేసుకున్నాడు.ఆయనతో సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు గా తెలుస్తుంది.
ఇక ఈ మూవీ సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనేది క్లారిటీ లేదు కానీ రామ్ చరణ్( Ram Charan ) కూడా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక రీసెంట్ గా కార్తీక్ సుబ్బరాజు రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య లను పెట్టి తీసిన జిగర్ తండ డబుల్ ఎక్సల్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తో నడుస్తుందనే చెప్పాలి…
.







