బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు.
ప్రగతిభవన్ లో పడుకునే కేసీఆర్ కావాలా? ప్రజల కోసం పని చేసే బీజేపీ కావాలా అని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.అదేవిధంగా కాంగ్రెస్ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు చేసిందేమీ లేదని చెప్పారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మడం లేదని పేర్కొన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న ఎంపీ లక్ష్మణ్ ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తానని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు.
బీసీని సీఎం చేస్తానని మోదీ చెప్పారని వెల్లడించారు.







