ఈనెల 13 న ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ భేటీ : అచ్చెన్నాయుడు

విజయవాడలో ఏర్పాటైన టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో భాగంగా జేఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

 Joint Manifesto Committee Meeting On 13th Of This Month: Achchennaidu-TeluguStop.com

ఇందులో భాగంగానే రైతులకు అండగా నిలవాలని జేఏసీ తీర్మానించింది.కరవు మండలాల్లో పర్యటించాలని నిర్ణయించిన జేఏసీ రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా అందేలా పోరాడాలని పిలుపునిచ్చింది.

అలాగే పదిహేను రోజులకు ఒకసారి జేఏసీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.ఈ సారి ఏర్పాటు చేయనున్న సమావేశం జనసేన కార్యాలయంలో జరగనుంది.

ఈనెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన ఉమ్మడి మ్యానిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తామని ప్రకటించారు.

ఈ మేరకు మ్యానిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా ఈనెల 13 న ఉమ్మడి మ్యానిఫెస్టో కమిటీ భేటీకానుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube