రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది.వేములవాడ నియోజకవర్గ టికెట్ విషయంలో వివాదం రాజుకుంది.
నియోజకవర్గ స్థానాన్ని పార్టీ తుల ఉమకు కేటాయించడంపై పార్టీలో ముసలం మొదలైంది.ఈ క్రమంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెన్నమనేని వికాస్ తెలిపారు.
కానీ వికాస్ అనుచరులుతో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు సాయంత్రంలోగా అభ్యర్థిని మార్చాలని అల్టీమేటం ఇచ్చారు.లేని పక్షంలో నియోజకవర్గంలోని నేతలంతా కలిసి మూకుమ్మడి రాజీనామా చేస్తామని ప్రకటించారు.







