ప్రస్తుత ప్రతిరోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్ వీడియోలను చూసిన తర్వాత ప్రజలు చాలా సంతోషిస్తారు.
అయితే కొన్ని వీడియోలను చూశాక రకరకాల ఫీలింగ్స్ ఒకేసారి కలుగుతుంటాయి.ముఖ్యంగా కొంత మంది విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లతో వంటకాలు చేస్తుంటారు.
తిండిని ఎక్కువగా ఇష్టపడే వారు ప్రతిరోజూ కొత్త వంటకాలు తినాలని, వాటిని స్వయంగా తయారు చేయాలని కోరుకుంటారు.
అలాగే కొందరైతే కొత్త టేస్ట్ కోసం కొత్తదనాన్ని ప్రయత్నిస్తూనే ఉంటారు.కానీ చేయలేని వారు సొంతంగా కొత్త వంటకాలను కనిపెడతారు.చాలా సార్లు వారు ఇలాంటివి చేస్తుంటారు.
వాటిని వినడం విషయం పక్కన పెడితే ఆ కాంబినేషన్ వింటేనో ఏదోలా ఉంటుంది.ఇలాంటి ఓ ఫుడ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఓ మహిళ బంగాళాదుంపలు, బిస్కెట్తో పకోడీలు ( potatoes, and biscuits )చేసింది.
వైరల్ వీడియోలో, ఒక మహిళ బంగాళాదుంపలను ఉడకబెట్టడం చూడవచ్చు.బంగాళదుంపలు ఉడకబెట్టిన తర్వాత, మసాలాను సరిగ్గా సిద్ధం చేసింది. రెండు పార్లే-జీ బిస్కెట్ల మధ్య బంగాళాదుంప మసాలాను పెడుతుంది.
తర్వాత వాటిని శనగ పిండిలో( besan flour ) ముంచుతుంది.ఇలా పక్కన పెట్టిన పార్లే-జీ బిస్కెట్లను( Parle-G Biscuits ) సలసలా కాగిన నూనెలో వేయిస్తుంది.
వాటిని చక్కగా ఓ ప్లేట్లో పెట్టి తినడానికి సర్వ్ చేస్తుంది.సాధారణంగా పకోడీలు అనగానే కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయని ఊహిస్తాం.
సాయంత్రం వేళ టీవీ చూస్తూ సరదాగా వాటిని తినాలని భావిస్తాం.అయితే సాంప్రదాయ టేస్ట్కు భిన్నంగా ఇలా బిస్కెట్ పకోడీని బహుశా ఎవరూ తిని ఉండరు.
ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేయబడింది.నెటిజన్లు ఆ వీడియోను చూశాక తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
ఫుడ్ కాంబినేషన్లతో కొత్త ప్రయోగాలు మహిళలు చేయడం సహజమేనని, అయితే ఇలాంటి కాంబినేషన్ తామెప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.ఓ యూజర్ మాత్రం బిస్కెట్ పకోడీలు చేసిన మహిళను ఒక గొప్ప కళాకారిణి అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.