కాంగ్రెస్ ( Congress ) పార్టీలో ఉన్న చాలామంది నాయకులు అటు ఇటూ అన్నట్లుగా రెండు పడవల ప్రయాణం చేస్తూ ఉంటారు.పార్టీ జోరు మీదుంటే ఈ పార్టీలోకి వచ్చి పడతారు.
లేకపోతే మరో పార్టీలోకి జంప్ అవుతారు.ఒకవేళ ఎన్నికల్లో మరో పార్టీకి ఎక్కువ లీడింగ్ ఉంటే ఈ పార్టీ నుండి జంప్ అయ్యి ఆ పార్టీలో చేరుతారు.
ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు జరిగింది.అయితే ఆ మధ్య కాలంలో బండి సంజయ్ ( Bandi Sanjay ) కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ పార్టీకే వస్తారని ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరునాడు కెసిఆర్ చిటికేస్తే బీఆర్ఎస్ లోకి వచ్చి కూర్చుంటారని,ఇక ఈ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా మాత్రమే కప్పుకొని తిరుగుతున్నారు.

కానీ వారి ఎన్నికల ఖర్చు మొత్తం కేసీఆరే ( KCR ) భరిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను సరఫరా చేసే ఏటీఎం గా మారిపోయింది అంటూ ఎప్పటినుండో బండి సంజయ్ మీడియా ముఖంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య ఉన్న ఈ విషయాన్ని బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విషయం నిజమే అన్నట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన కామెంట్లు అనిపిస్తున్నాయి.

తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy ) ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 59 స్థానాలు వస్తే కచ్చితంగా ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉంటారు.కానీ 59 స్థానాలకు ఏ ఒక్క సీటు తగ్గినా కూడా పార్టీ నుండి చాలామంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంప్ అవుతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఇక కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ విషయంలో బండి సంజయ్ ( Bandi Sanjay ) ఎప్పటినుండో చెబుతున్న ఆ విషయాలు నిజమేనని అందరూ భావిస్తున్నారు.అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలపై సీఎం అవుతాను అని చెప్పుకుంటూ తిరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కే నమ్మకం లేదు.
మేము ఎలా నమ్మాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారట.







