మన రెండు తెలుగు రాష్ట్రాలలో అరటి పంట సాగు( Banana cultivation | ) విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. రైతులు( Farmers ) అరటి పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుని సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
కాకపోతే కొన్ని యాజమాన్య పద్ధతులు సరిగ్గా పాటించకపోవడం వల్ల అధిక దిగుబడులు సాధించ లేకపోతున్నారు.అరటి పంటలో అధిక దిగుబడి సాధించాలంటే.
పంటను ఆశించే నులి పురుగుల నుండి పంటను తొలి దశలోనే సంరక్షించుకోవాలి.అరటిని ఆశించే నులి పురుగులు నాలుగు రకాలుగా ఉంటాయి.
ఈ నులి పురుగులు అరటి మొక్కల వేర్లను, దుంపలను ఆశించి మొక్కలు కుళ్లిపోయేటట్లు చేస్తుంది.కాబట్టి నులి పురుగులను నుండి అరటి పంట( Banana crop )ను సంరక్షించుకునే పద్ధతులు ఏమిటో చూద్దాం.

నులి పురుగులు( Worms ) ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి వాడి పోతాయి.వేర్లను ఆశించడం వల్ల వేర్లపై కాయల వంటి బుడికలు ఏర్పడతాయి.నులి పురుగులు సోకనటువంటి మొక్కల నుండి పిలకలు సేకరించాలి.పిలకల దుంపపై చర్మం పలుచగా చెక్కి తర్వాత క్లోరిపైరిఫాస్ 25% ఇసిఏ 2మి.లీ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్( Copper Oxychloride ) 5గ్రా.కలిపిన ద్రావణంలో ముంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

నులి పురుగులు సోకిన అరటి తోట మొక్కలకు 25గ్రా.నుండి 40గ్రా.కార్బోఫ్యూరాన్ గుళికలు మొక్క మొదలు వద్ద 10సెం.మీ లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి.డ్రిప్ నీటి పారుదల సౌకర్యం ఉంటే.పంట నాటుకున్న తర్వాత సుడోమొనాస్ ఫ్లోరోసెన్స్ జీవ సంబంధ మందును ఎకరాకు 1.6 లీటర్లను నీటిలో కలిపి డ్రిప్ నీటి ద్వారా పంటకు అందించడం వల్ల నులిపురుగులను తగ్గించవచ్చు.అరటి తోటల్లో పంట మార్పిడి చేసి వరి పంట( rice crop )ను వేస్తే పొలంలో నులి పురుగుల బెడదను తగ్గించవచ్చు.







