తెలంగాణ సమాన అభివృద్ధిని కోరుకుంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.సోనియా గాంధీ చొరవ వలనే తెలంగాణ వచ్చిందని తెలిపారు.
లెక్కలు వేసుకునో, కేసీఆర్ దీక్షతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ బతకదని తెలిసి కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో పాలన తీరు మారిందన్నారు.ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలకు ప్రాధాన్యత లేదని మండిపడ్డారు.
పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.







