తాజాగా నవంబర్ ఒకటవ తేదీన మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ( Varun tej )హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya tripathi ) లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం మనందరికీ తెలిసిందే.ఐదేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుంటూ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసిన ఈ జంట ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
వారి ప్రేమను పెద్దలకు చెప్పి ఇరు కుటుంబాల సమక్షంలో అంగ రంగవైభవంగ్ పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

పెళ్లికూతురు పెళ్ళికొడుకు సంబంధించిన ఫోటోలతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ముఖ్యంగా మెగా హీరోలు అందరూ కలిసి ఒకటే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.ఇది ఇలా ఉంటే ఈ జంట పెళ్లి వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు బంధువులతో పాటు స్నేహితులు అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.
ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ( Social mrdia )ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ పెళ్లి వేడుకకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు మిస్ అయినట్లుగా హాజరు కాలేకపోయినట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి తల్లిగారు కాకుండా మరొక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఈ పెళ్లికి హాజరు కాలేదట.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఎందుకు పెళ్లికి రాలేకపోయారు ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.పెళ్లి ఫొటోస్ లో అంతా బాగున్న ఒక పెద్దాయన మాత్రం మిస్సయ్యారని నెటిజన్స్ గుర్తించారు.దీంతో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి.అది కూడా మెగా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో ఏమైందా అని కామెంట్స్ పెడుతున్నారు.ఆ ఫోటోల్లో మిస్ అయిన వ్యక్తి అల్లు అరవింద్.
( Allu aravind ) అల్లు అరవింద్ లేకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ ఏ పండగ జరగదనే విషయం తెలిసిందే.మరి అలాంటిది ఎందుకు ఆయన రాలేదు.
ఎందుకు ఆయన లేకుండానే ఈ పెళ్లి జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెళ్లి ఫోటోల్లో ఆఖరికి పవన్ ( Pawan Kalyan )కూడా ఉన్నారు.
మరి అల్లు అరవింద్ లేకపోడవం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఈ టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదివరకు అల్లు అరవింద్ ఫ్యామిలీకి( Allu Arvind Family ) మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి.ఆ కారణం చేతే అల్లు అరవింద్ పెళ్లికి రాలేదు అన్నా కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.







