దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో మొబైల్ ఫోన్ కొనాలి అనుకునే వారంతా 5జీ ఫోన్ల వైపే( 5G Phones ) చూస్తున్నాయి.కానీ 5జీ ధరలు కాస్త అధికంగా ఉండడంతో సామాన్యులు కొనలేక పోతున్నారు.
ఆలాంటి సామాన్యుల కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్( Flipkart Big Diwali Sale ) ప్రారంభించింది.ఈ బిగ్ దీపావళి సేల్ లో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.రూ.15 వేల లోపు లభించే ప్రముఖ కంపెనీలకు చెందిన 5జీ ఫోన్లు ఏమిటో చూద్దాం.
Poco M6 ప్రో 5జీ:
బిగ్ దీపావళి సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ లో రూ.9999 కే పొందవచ్చు.ఈ ఫోన్ సాధారణ గేమింగ్ కోసం స్నాప్ డ్రాగన్ 4జెన్ 2 చిప్ సెట్ ను( Snapdragon 4 Gen 2 ) అందిస్తుంది.ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి, 18W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తోంది.

iQOO Z6 Lite 5G:
ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ.13989 కే పొందవచ్చు.సాధారణ గేమింగ్ కోసం స్నాప్ డ్రాగన్ 4జెన్ 1 చిప్ సెట్ ను అందిస్తుంది.120Hz స్క్రీన్ తో ఉండే ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ M14 5G:
ఈ ఫోన్ రెండు స్పెసిఫికేషన్ లలో వస్తుంది.శాంసంగ్ గెలాక్సీ M14 5G,( Samsung Galaxy M14 5G ) శాంసంగ్ గెలాక్సీ F14 5G.రెండిటిలోనూ ఒకే విధమైన పర్ఫామెన్స్ ఉంటుంది.కాకపోతే M సిరీస్ లో అదనంగా 2- మెగా పిక్సెల్ రియల్ కెమెరా ఉంటుంది.
ఈ రెండు ఫోన్లు 6000 mAh బ్యాటరీ తో వస్తాయి.ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే, చార్జర్ ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది.శాంసంగ్ గెలాక్సీ M14 5G ఫోన్ ధర రూ.11,967.శాంసంగ్ గెలాక్సీ F14 ఫోన్ ధర రూ.11490 కే పొందవచ్చు.ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ అయినా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే పది శాతం ప్రత్యేక కౌంట్ ఉంటుంది.







