స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ టోర్నీలో( World Cup tournament ) భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించడం జరిగింది.
ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా భారత్ సంచలన విజయం నమోదు చేసుకోవడం జరిగింది.లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి ఇంగ్లాండ్( England ) బౌలింగ్ ఎంచుకోవడంతో.
బ్యాటింగ్ కి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేయడం జరిగింది.అనంతరం 230 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ 129 పరుగులకే ఆల్ అవుట్ కావడం జరిగింది.
దీంతో 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ ఓటమితో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది.
ఇదే సమయంలో భారత్.సెమీస్ కు దూసుకుపోయింది.
ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఇప్పటిదాకా 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్కదాంట్లోనే విజయం నమోదు చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో భారత్ తో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచి ఉంటే ఇంకా మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్ లు గెలిస్తే అప్పుడు సెమిస్ కి చేరుకునే అవకాశం ఇంగ్లాండ్ కి ఉండేది.
కానీ భారత్ తో జరిగిన మ్యాచ్.ఓడిపోవడంతో ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు అడియాశలయ్యాయి.







