ఒప్పో కంపెనీ తాజాగా ఇండియాలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది.ఒప్పో A79 5G( Oppo A79 5G ) పేరిట తీసుకొచ్చిన ఈ మొబైల్ ప్రీమియంగా కనిపించే స్లీక్, సన్నని డిజైన్తో వస్తుంది.
ఇది మెటాలిక్ ఫినిషింగ్తో పాలికార్బోనేట్తో తయారయ్యింది.ఈ ఫోన్ రింగ్ ఆకారం డిజైన్తో రియర్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ను కలిగి ఉంది.
మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్స్.ఫోన్ ముందు భాగంలో FHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్తో 6.72-అంగుళాల స్క్రీన్ ఉంది.ఇది పర్యావరణానికి అనుగుణంగా బ్రైట్నెస్, కలర్ టెంపరేచర్ను సర్దుబాటు చేసే ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
Widevine L1 సర్టిఫికేషన్తో ఇది వస్తుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో HD స్ట్రీమింగ్కు ఫోన్ మద్దతు ఇస్తుంది.

ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో రన్ అవుతుంది, దీనిని మరొక ఒప్పో ఫోన్ A2mలో కూడా ఉపయోగించారు.ఈ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695, స్నాప్డ్రాగన్ 778G, స్నాప్డ్రాగన్ 4 జెన్ 1( Snapdragon ) వంటి ప్రాసెసర్లకు సమానమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.8GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తున్న ఈ మొబైల్లో వర్చువల్గా మరో 8GB వరకు విస్తరించవచ్చు.ఇది 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్టీరియో సౌండ్తో కూడిన డ్యూయల్ స్పీకర్ సిస్టమ్ను కలిగి ఉంది.

ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్తో త్వరగా ఛార్జ్ అవుతుంది.ఆండ్రాయిడ్ 13, ColorOS 13తో వస్తుంది, డ్యూయల్ సిమ్ కార్డ్లు, 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఆఫర్ చేస్తుంది.ఒప్పో A79 5G గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ వంటి రెండు రంగులలో లభిస్తుంది.దీని ధరను రూ.19,999గా( Oppo A79 5G Price ) కంపెనీ నిర్ణయించింది.అయితే ధరను తగ్గించే కొన్ని ఆఫర్లు ఉన్నాయి.ఉదాహరణకు, రూ.4,000 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది.మరో రూ.4,000 తగ్గింపును ఇవ్వగల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.







