జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానకొండూరర్ ( Manakondur )నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో గురువారం రోజున ఇల్లంతకుంట మండల టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు ముత్యం భాగ్యలక్ష్మి( Bhagyalakshmi ) కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి పార్టీలోకి కవ్వంపల్లి సత్యనారాయణ స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వుట్కూరి వెంకట రమణారెడ్డి( Venkata Ramana Reddy ), మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూంపల్లి రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిస ఐలయ్య యాదవ్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఏలేటి మాధవరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆకుల సత్యం,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.