సైబర్ వలలో చిక్కిన వృద్ధ దంపతులు.. PF సొమ్ముకు ఆశపడితే రూ.4కోట్లు స్వాహా…!

ఓ వృద్ధ జంటకు కొంత సొమ్ము జమ చేస్తే పెద్ద మొత్తంలో PF డబ్బులు( PF money ) అందుకోవచ్చు అంటూ మాయ మాటలు చెప్పి సైబర్ నేరగాళ్లు ఎరవేశారు.వీరి మాటలను నమ్మిన వృద్ధ జంట సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) చెప్పిన విధంగానే విడతల వారీగా రూ.4.35 కోట్లు చెల్లించారు.ఈ వ్యవహారం అంతా ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ లో జరిగింది.తాము మోసపోయామని గ్రహించిన ఆ వృద్ధ జంట ముంబైలోని కఫ్ పరేడ్ పోలీసులను ఆశ్రయించారు.

 Old Couple Trapped In Cyber Fraud Want To Pf Money Rs 4 Crores Loss-TeluguStop.com

దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే.ముంబై కి చెందిన 70 ఏళ్ల వృద్ధ వ్యక్తి ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్డ్అయ్యాడు.అయితే ఆ వృద్ధుని భార్యకు గుర్తుతెలియని ఓ మహిళ ఫోన్ చేసి తాను ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని నమ్మించి ఆమె భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పి ఆ వృద్ధురాలిని పూర్తిగా నమ్మించింది.

మీ భర్త PF ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్ చేసిందని, ఆ డిపాజిట్ మెచ్యూర్ అయితే సుమారుగా రూ.11 కోట్లు వస్తాయని నమ్మించింది.అయితే అందుకోసం TDS, GST, income tax చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.

ఈ విషయాలను నమ్మిన ఆ వృద్ధ మహిళ కాలర్ చేసిన మహిళ చెప్పినట్లుగా బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసింది.ఇలా మే నుంచి సెప్టెంబర్ వరకు విడతల వారీగా రూ.4.35 కోట్లు బ్యాంక్ ఖాతాలో జమ చేసింది.ఇంకా డబ్బులు డిపాజిట్ చేయాలని కాలర్ ఆ వృద్ధ మహిళను డిమాండ్ గా అడగడం, డబ్బు డిపాజిట్ చేయకపోతే ఐటీ శాఖకు సమాచారం ఇస్తామని బెదిరించడం చేసింది.దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు( police ) కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube