ఏపీలో టీడీపీ – జనసేన పార్టీలు స్పీడ్ పెంచాయి.ఐక్య కార్యాచరణకు పదునుపెట్టిన రెండు పార్టీలు పలు కార్యక్రమాలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఈ మేరకు ఈనెల 29 నుంచి 31 వ తేదీ వరకు జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నాయి.ఇందులో భాగంగా 29న శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాల సమన్వయ సమావేశాలు జరగనుండగా 30వ తేదీన కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాల ఉమ్మడి భేటీలు సాగనున్నాయి.
అలాగే 31న విశాఖతో పాటు పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల సమావేశాలు జరగనున్నాయి.టీడీపీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోకు అదనంగా మరో నాలుగు అంశాలను జనసేన జోడించింది.
ఈ క్రమంలోనే నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్న టీడీపీ -జనసేన ఆ రోజు నుంచే ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నాయి.అనంతరం నవంబర్ 3న విజయవాడలో రెండు పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది.







