బెంగళూరులోని దుర్గాపూజ( Durga Puja in Bangalore ) మండపాన్ని రెండు కుక్కలు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.ఆస్కార్, కర్మ అనే రెండు గోల్డెన్ రిట్రీవర్లు బ్లూ కలర్ దుస్తులను ధరించి, మండపంలో ప్రవేశించి పూజారి నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నట్లు వీడియో చూపిస్తుంది.
పూజారి వారి నుదిటిపై బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తాడు.ఈ వీడియోలో “కుక్కలను అనుమతించాలా? వద్దా? మీరు ఏమనుకుంటున్నారు?” అని అడిగే క్యాప్షన్ ఉంది.“చాలా మండపాలు కుక్కలకు నో చెప్పాయి, ఇదొక్కటే కుక్కలను అనుమతించింది.పూజారి కుక్కలకు తిలకం కూడా పెట్టారు.” అని కూడా వీడియోలో పేర్కొనడం గమనించవచ్చు.

ఈ వీడియో కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయింది.54 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కుక్కలకు స్వాగతం పలికి సకల జీవరాశుల పట్ల గౌరవం చూపుతున్న మండపం అధికారులను కొందరు అభినందిస్తున్నారు.దుర్గమ్మ ఈ సృష్టిని ప్రేమిస్తుందని, కుక్కలు కూడా ఆ సృష్టిలో భాగమని వారు చెప్పారు.
మరికొందరు మండపంలోకి కుక్కల ఉనికిని విమర్శిస్తూ ప్రజలకు అసౌకర్యంగా ఉందని అంటున్నారు.కుక్కలను ఇంట్లోనే పెంచుకోవాలని, మత స్థలాలకు తీసుకురావద్దని చెబుతున్నారు.
గతంలో కూడా దేవాలయాల వద్దకు, అలాగే మత స్థలాలకు శునకాలను తీసుకెళ్లి కొందరు యజమానులు చిక్కుల్లో పడ్డారు.హిందువుల మనోభావాలను( Hindu sentiments ) దెబ్బతీయకుండా ఉండేందుకు జంతువులను ఆలయాల లోపలికి తీసుకెళ్లకపోవడమే మంచిదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.







