మహారాష్ట్రలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం జరిగింది.రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కు చెందిన శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
దీంతో అత్యవసర ల్యాండింగ్ చేసింది.
అయితే ల్యాండింగ్ చేసే సమయంలో వేగం అదుపులోకి రాకపోవడంతో ఎయిర్ క్రాఫ్ట్ తిరగబడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ ఫైలట్లు క్షేమంగా బయటపడ్డారు.పూణె జిల్లాలోని గోజుబావి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ క్రమంలోనే ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.







