టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 24న తిరుమలకు వెళ్లనున్నారు.స్వామివారి దర్శనం తరువాత చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లికి వెళ్తారని నారా లోకేశ్ తెలిపారు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన చంద్రగిరి నుంచి ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభించనున్నట్లు లోకేశ్ చెప్పారు.చంద్రబాబు అరెస్టు వార్త విని మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని తెలిపారు.







