తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నిన్న మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందన్న కేటీఆర్ బోర్డు ప్రక్షాళన అంటున్నారని విమర్శించారు.
అంటే చిన్నదొర తప్పు ఒప్పుకున్నట్లే కదా అన్న వైఎస్ షర్మిల ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు.ఈ డ్రామాలన్నీ ఎందుకన్న ఆమె ఏళ్ల తరబడి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికైనా కేటీఆర్ తప్పు ఒప్పుకుని తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.







