కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని విమర్శించారు.
లక్ష కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.కాంగ్రెస్ హయాంలోనే అవినీతి జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్, 24 గంటల కరెంట్ ఉండదని ఆరోపించారు.ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ కు రైతులు అంటే చిన్న చూపు ఉందన్న కవిత తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.







