ప్రవళిక మృతి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.ఈ ఘటనలో కొందరు రాజకీయ నేతలపై కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.
ప్రవళిక ఆత్మహత్యపై ఆందోళన కార్యక్రమం నిర్వహించిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.అయితే ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటానికి గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడటమే కారణమని ఆరోపిస్తూ నేతలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సదరు నాయకులపై 143, 148, 341, 332 ఆర్/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.అయితే ప్రవళిక మృతికి శివరామ్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు ప్రేమ వ్యవహారం కారణంగా బలవన్మరణానికి పాల్పడిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.







