తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.ఈ క్రమంలోనే కేంద్రమంత్రులు రాష్ట్ర బాట పట్టారు.
ఈ మేరకు రాష్ట్రానికి వస్తున్న పలువురు కేంద్రమంత్రులు పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు.
హుజురాబాద్ లో జరిగే జనగర్జనకు హాజరుకానున్న ఆయన తరువాత మహేశ్వరంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఈ క్రమంలో మరికాసేపటిలో రాజ్ నాథ్ సింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
అక్కడ నుంచి నేరుగా హుజురాబాద్ సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు.పర్యటన నేపథ్యంలో బహిరంగ సభా ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు.