సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది.నాగర్ కర్నూల్ నియోజకవర్గ సీటును ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది.
నాగర్ కర్నూల్ స్థానానికి అభ్యర్థిగా కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది.దీంతో నాగం జనార్థన్ రెడ్డి పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే పార్టీలో పలువురు సీనియర్ నేతలను కాదని పార్టీ అధిష్టానం ఇటీవల కొత్తగా ఇతర పార్టీల నుంచి చేరిన పదకొండు మందికి తొలి జాబితాలో టికెట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.అయితే నాగంకు టికెట్ కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







