టీడీపీ నేతలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధారాలతో సహా చంద్రబాబు దొరికిపోయారన్న మంత్రి బొత్స జిమ్మిక్కులతో చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చారని చెప్పారు.చంద్రబాబుకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కోర్టుకు విన్నవించుకోవాలని తెలిపారు.
కేవలం రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబుకు అనారోగ్యం అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అయితే చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని తెలిపారు.







