తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరువాత మొదటిసారి కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.ఈ మేరకు రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో బీజేపీ నిర్వహించే జనగర్జన సభలో అమిత్ షా పాల్గొననున్నారు.అనంతరం హైదరాబాద్ లో మేధావులతో భేటీ కానున్న అమిత్ షా బీజేపీ ముఖ్యనేతలతోనూ సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.







