టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు, లోకేశ్ కు జైలు శిక్ష తప్పదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తండ్రీకొడుకులతో పాటు కొందరు మాజీ మంత్రులు కూడా అరెస్ట్ కాక తప్పదని విజయసాయిరెడ్డి తెలిపారు.చంద్రబాబు కోసం టీడీపీ నేతలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు, అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
అవినీతి చేసి జైలు పాలైన వ్యక్తి కోసం నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే టీడీపీ ఆరిపోయే దీపం అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.







