చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై గత మూడు రోజులుగా వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 Hearing On Chandrababu Bail And Custody Petitions Today-TeluguStop.com

అయితే కావాలనే కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే కోర్టుకు తెలిపారు.అటు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు పేర్కొన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ నిన్నటితో ముగియగా వర్చువల్ గా ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు అధికారులు.

ఈ క్రమంలో చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 19వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube