చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి.ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Chandrababu's Bail Petition In Ap High Court-TeluguStop.com

ఈ పిటిషన్ నిన్న విచారణ చేపట్టగా కోర్టు సమయం పూర్తి కావడంతో ఇవాళ్టికి వాయిదా పడింది.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కాగా ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును పోలీసులు ఏ25గా పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

ఈ క్రమంలో ఇప్పటికే ఇరువర్గాల న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు.చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున ఏఏజీజ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.

కాగా కాల్ వర్క్ అనంతరం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.అయితే ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ ముగియనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube